15.10.2025
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
Vrm Media ఖమ్మం ప్రతినిధి




బాణసంచా దుకాణాల కేటాయింపునకు బుధవారం పోలీస్ కాన్ఫిరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాటరీ పద్దతిలో డ్రా తీసి ఒకొక్కరికి దుకాణాలు కేటాయించారు.
ఈ సందర్బంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. నిబంధనల మేరకునగరంలోని రెండు మైదానాల్లో 128 దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు జిల్లా అధికారులు అనుమతిచ్చారని, వీటిని ఎవరు అతిక్రమించవద్దని అన్నారు. డిగ్రీ కళాశాలలో 86, పెవిలియన్ మైదానంలో 42 ఏర్పాటు చేయాలని నిర్ణయించి డ్రా తీసినట్లు తెలిపారు. మొత్తం 148 మంది దరఖాస్తుదారుల్లో 128 దీపావళి బాణసంచా దుకాణాలు కేటాయించిన్నట్లు తెలిపారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దీపావళి సందర్భంగా నగర పరిధిలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బాణసంచా విక్రయదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బాణసంచా దుకాణదారులు బకెట్లలో ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనుమతి లేకుండా ఎవరైన బాణసంచా దుకాణాలు నడుపుతుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.బాణసంచా దుకాణాల ముసుగులో ఎవరూ కూడా డబ్బులు వసూళ్ళు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. అదేవిధంగా దుకాణదారులు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని సూచించారు.
కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు. పి ఆర్ వో
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird