42 శాతం బీసీల రిజర్వేషన్లు సాధన కోసం సాగుతున్న పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో రేపు 18వ తేదీన జరగబోయే బంధుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు బానోత్ కిషన్ నాయక్ బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ బంధ్ చారిత్రాత్మకమని, అందరు సభ్యులు ఇందులో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇది బీసీ సమాజం కోసం కీలక దశ అని, ప్రభుత్వం బీసీల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ ఆయన కోరారు.