


VRM మీడియా న్యూస్
రిపోర్టర్ : లక్ష్మయ్య | సత్తుపల్లి | ఖమ్మం జిల్లా
తేదీ : 18.10.2025 (శనివారం)
తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు జరిగిన బంద్ కార్యక్రమం సత్తుపల్లిలో అఖిల పక్ష పార్టీలు, సంఘాల నాయకులు, కార్యకర్తల సమన్వయంతో విజయవంతంగా జరిగింది.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు
సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి గారు
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డా. మట్టా దయానంద్ గారు
బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరవు శ్రీనివాస్ గారు
తో పాటు అఖిల పక్ష నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల వ్యాఖ్యలు
“బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేస్తున్నాను.
బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం కొనసాగుతుంది,” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
“రాహుల్ గాంధీ ఆశయాల సాధనలో సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు.
బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది,” అన్నారు.
బీసీ బంద్కు ప్రజల మద్దతు
సత్తుపల్లి మెయిన్ రోడ్ నుండి పాత సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ, ధర్నా నిర్వహించబడింది.
తరువాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో విలేకరుల సమావేశం జరిగింది.
బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించిందని నాయకులు తెలిపారు.