

సంగీత ప్రపంచంలో ‘ఇసైజ్ఞాని’ గా పిలుచుకునే ‘ఇళయరాజా'(ఇళయరాజా)సంగీతానికి ఉన్నశక్తి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన స్వరపరిచిన పాట నిత్యం ఏదో ఒక చోట మారుమోగిపోతూనే ఉంటుంది. నేటికీ విడుదలవుతున్న చాలా కొత్త చిత్రాలలో కూడా ఇళయరాజా పాటలని ఉపయోగిస్తున్నారు. కాకపోతే ఈ విషయంలో తన అనుమతి లేకుండా తన పాటలని ఉపయోగించుకుంటున్నారని ఇళయరాజా కోర్ట్ ద్వారా సదరు చిత్రాల మేకర్స్ కి నోటీసులు పంపిస్తూనే ఉన్నాడు.
ఈ కోవలోనే ఇప్పుడు థియేటర్స్లో రన్ అవుతున్న డ్యూడ్ మూవీలో తన అనుమతి లేకుండా పాటలని ఉపయోగించుకున్నారని, కాబట్టి మేకర్స్ పై, సోనీ మ్యూజిక్ పై నియంత్రణ చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వడానికి అనుమతి ఇవ్వడానికి కోరుతూ ఇళయరాజా చెన్నై(చెన్నై)హైకోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ విషయంపై కోర్టు సూచన ఇళయరాజా న్యాయపరంగా ముందుకెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ఈ తీర్పుతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది
‘డ్యూడ్’ లో ప్రదీప్ రంగనాథన్(ప్రదీప్ రంగనాథన్),మమిత బైజు(మమిత బైజు)నటించగా ఈ నెల 17న తమిళంతో పాటు తెలుగులో భారీ థియేటర్లలో విడుదలైంది. తెలుగులో అగ్ర నిర్మాణంగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ఈ నిర్మించడం విశేషం.ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు పెళ్లికి సంబంధించిన సీన్ వచ్చినప్పుడు ‘పుదు నెల్లు పుధు నాతు(Pudhu nellu Pudhu Naathu)అనే తమిళ ‘కరుతమచ్చన్'(Karutha Machan)అనే సాంగ్ ని ఉపయోగించడం జరిగింది. ఇళయరాజా సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ పాటని ఎస్ జానకి ఆలపించగా హీరోయిన్ సుకన్య పై చిత్రీకరించారు. ఇళయరాజానే సాహిత్యాన్ని అందించడం కూడా విశేషం. భారతి రాజా(BharathiRaja)దర్శకుడు కాగా 1991 లో విడుదలైంది.