సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 30
కడప జిల్లా సిద్దవటం మండలం మాచుపల్లి, కాజీపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసింది. ఈ చెక్కులను టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు మరియు కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్ప శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ప్రజల కష్టసమయంలో అండగా నిలిచి తక్షణ సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీనివాస రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, సత్య చిట్ ఫండ్ MD బాలకృష్ణ రెడ్డి, మచుపల్లి ఓబుల్ రెడ్డి, కాజీపల్లి కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.