భారతదేశంలోనే రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట రామాలయంలో శ్రావణ శనివారం నాడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి జైశ్రీరామ్ నామస్మరణతోవారి భక్తిని చాటుకున్నారు. అంతేకాకుండా శ్రావణమాసం కావున ప్రతి శనివారం తండోపతండాలుగా భక్తులు పాల్గొంటున్నారు అంతేకాకుండా పురాతన పుణ్యక్షేత్రంలోని శిల్పాల సౌందర్యాన్ని తిలకించి భక్తులు పులకించి పోతున్నారు పురాతన పుణ్యక్షేత్రమైన శ్రీ కోదండ రామాలయం టిటిడి లో లీనమైన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందని భక్తులు టీటీడీని కొనియాడుతున్నారు.