
రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 17
వారి అశీసులతో సింగిల్ విండో సహకార సంఘం బ్యాంకు లిమిటెడ్ నందు కొత్త ప్రెసిడెంట్, డైరెక్టర్ల తొలి సంతకాలు ఘనంగా నిర్వహించబడినాయి.
కార్యక్రమంలో సింగల్ విండో ప్రెసిడెంట్ ధరపనేని దసరధ నాయుడు, డైరెక్టర్లుగా లింగాల సాంబశివ రెడ్డి, గజ్జల బాలిరెడ్డి,వీరభద్రుడు సంతకాలు చేసారు. ఈ కార్యక్రమం లో పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, వార్డ్ మెంబర్ ఓబుల్ రెడ్డి, శ్రీనివాసులు, శంకర్, అలాగే బ్యాంకు మేనేజర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా హాజరై నూతనంగా ఎన్నికైన సంఘ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.
స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఈ కొత్త నిర్వాహక వర్గం మరింత తోడ్పాటు అందిస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird