ఈ నెల 19న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు! ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్ తో లింక్ అయిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం అందనుంది. ఒంటిమిట్ట మండలంలోని రైతులందరూ సీఎం కిసాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒంటిమిట్ట మండల బిజెపి అధ్యక్షుడు భాను ప్రకాష్ కోరారు.