
ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్
నరసింహ రాజు
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్25
ఒంటిమిట్ట
మంగళవారంనాడు ఒంటిమిట్ట మండలంలోని ప్రజలకు సర్కిల్ ఇన్స్పెక్టర్. నరసింహారాజు ఒంటిమిట్ట మండల ప్రజలను ఉద్దేశించి క్రికెట్ బెట్టింగులు చాలా ప్రమాదమని ప్రజలు మారాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అంతే కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ రాయుళ్లపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. క్రికెట్ బెట్టింగ్లలో ఎంతోమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకునే కాకుండా ఉన్న ఆస్తులు డబ్బులు ఇల్లు పొలాలు సర్వము పోగొట్టుకుని రోడ్డున పడడమే కాకుండా ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అటువంటి వారి వలన వారి కుటుంబ సభ్యులకు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది క్రికెట్ బెట్టింగులు మానేయడం వలన మీతో పాటు మీ కుటుంబాలు మీ స్నేహితులు బాగుపడతారని బెట్టింగ్ రాయుళ్ల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird