
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 27
అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాజంపేట నియోజకవర్గ నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ గురువారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.గురువారం రాజంపేట టిడిపి కార్యాలయంలో ఆమెకు జగన్మోహన్ రాజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీ లో చేరానని తెలిపారు.పార్టీ కోసం శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird