Home వార్తలు 2015 గ్రూప్2 ర్యాంకర్లకు ఊరట – VRM MEDIA

2015 గ్రూప్2 ర్యాంకర్లకు ఊరట – VRM MEDIA

by VRM Media
0 comments
2015 గ్రూప్2 ర్యాంకర్లకు ఊరట


సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు

హైదరాబాద్, నవంబర్ 27 (ఈవార్తలు): తెలంగాణ గ్రూప్ 2 (2015) వివాదంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రధాన హైకోర్టు న్యాయమూర్తి (సీజే) అనుమతిని ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట లభించింది. 2015-16లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వైట్ నర్, దిద్దుబాటు ఉన్న జవాబు పత్రాలను మూల్యాంకనం చేసినట్లు టీజీపీఎస్సీపై ఆరోపణలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం.. గ్రూప్ 2లో ఎంపికైన వారి జాబితాను రద్దు చేసింది. ఈ తీర్పుపై టీజీపీఎస్సీ మరోమారు హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి ధర్మాసనం విచారించి తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది.

రంజుగా కర్నాటకం!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,811 Views

You may also like

Leave a Comment