Home తెలంగాణ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: అడ్లూరి – VRM MEDIA

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: అడ్లూరి – VRM MEDIA

by VRM Media
0 comments
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: అడ్లూరి


పెగడపల్లి, నవంబర్ 25 (ఈవార్తలు): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని పెగడపల్లిలో వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షల మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు సోమవారం విడుదల చేయగా జగిత్యాల జిల్లాలో 2025-26 వ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11,825 స్వయం సహాయక సంఘాలకు రూ.10.69 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదలయ్యాయి. మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసింది ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని. ఇప్పటివరకు 10853 ఇండ్లు అయ్యాయని, కొంతమంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహ ప్రవేశ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో మధుసుధన్, డీఆర్డీవో రఘువరన్ , ఎమ్మార్వో, ఎంపీడీవో , స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, సంభవించినవి.

నాటి ‘దీక్షా దివస్‌’.. ఓ యాది!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,812 Views

You may also like

Leave a Comment