
సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ డిసెంబర్ 1
సిద్ధవటం మండలం రాజంపేట ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి , పంచాయతీ కార్యదర్శి నాగలింగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగముని రెడ్డి మాట్లాడుతూ, “సామాజిక పెన్షన్ పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పెద్ద కొడుకు లా పేదల బాగోగులు చూసుకుంటూ పెన్షన్ను ఇంటి వద్దకే చేర్చి సౌకర్యాన్ని అందిస్తున్నారు” అని తెలిపారు.
అంతేకాకుండా నాగముని రెడ్డి మాట్లాడుతూ,
“వికలాంగులకు ప్రభుత్వ పెన్షన్ ఆత్మవిశ్వాసం కలిగించే జీవన శక్తి. వితంతువులకు ఈ పెన్షన్ నూతన జీవనానికి ధైర్యం ఇచ్చే వెలుగు” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భారతి, వెంకటసుబ్బయ్య టీడీపీ కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird