

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 6
శనివారం నాడు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వెనుక జేఏసీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఒంటిమిట్టను కడప జిల్లా నుంచి తొలగించి అన్నమయ్య జిల్లాలో కలపడం మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ దీక్షలో మొదటి రోజు చెరువు సంఘం అధ్యక్షుడు పాటూరు గంగిరెడ్డి చెరువు సంఘం ఉపాధ్యక్షుడు కట్ట యాదయ్య. పెన్న పేరూరు సర్పంచ్ లక్ష్మీనరసయ్య. సామ్రాట్ సుబ్బారెడ్డి. పెన్న పేరూరు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కదిరి చంద్రపాల్. సాంబయ్య రిలే నిరాహార దీక్షలో మొదటి రోజున పాల్గొన్నారు. వీరికి పూలమాలలతో తెలుగుదేశం మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి. మండల క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మలకుంట ఈశ్వరయ్య. మాజీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు. క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఎస్ వి రమణ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లాయర్ రాందాస్ వీరికి పూలమాలలు వేసి సాదరంగా స్టేజి మీదకి ఆహ్వానించారు. కడప జిల్లాలో కొనసాగుతున్న ఒంటిమిట్ట మండలాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటికి మార్చడం సబబు కాదని ఒంటిమిట్టను యధావిధిగా కడపలో ఉంచాలని లేదంటే రాజంపేట ను జిల్లాగా ప్రకటించిన మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాయచోటి వద్దు కడప ముద్దు అంటూ నినాదంతో ఒంటిమిట్ట మండలంలో మారుమోగిపోయింది రైతులకు వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా పని పడితే ఒంటిమిట్ట నుండి రాయచోటికి వెళ్లడం కష్టతరంగా మారుతుందన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఒంటిమిట్ట కోదండ రామాలయం ఇక్కడ ఉండడం మరిచి ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించడమేనని మా ప్రాంతానికి ఎటువంటి సదుపాయాలు లేకుండా ఎంతో దూరం ఉన్నా రాయచోటికి ఇవ్వడం సమంజసం కాదన్నారు ప్రజలకు దగ్గరగా ఉండి అన్నమయ్య జిల్లాలోనే కలపాలనుకుంటే రాజంపేట ను జిల్లాగా మార్చాలని కోదండ రామయ్య సాక్షిగా న్యాయం జరిగే వరకూ రేలే నిరాహార దీక్షలో కాక అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనకాడబోమని అన్నారు. ఒంటిమిట్ట మండలాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటికి మార్చడం ప్రజలు ప్రజా నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒంటిమిట్ట ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండాఒంటిమిట్ట మండలాన్ని యధావిధిగా కడపలోనే కొనసాగించాలని ఉద్యమకారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి. బిజెపి మండల అధ్యక్షుడు. భాను ప్రకాష్ రాజు. అడ్వకేట్ రామదాసు. క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ. తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు. తెలుగుదేశం పార్టీ మండల కో కన్వీనర్ కట్ట సుబ్బరాయుడు. గజ్జల శ్రీనివాసులురెడ్డి. మామిళ్ళ కృష్ణయ్య. హరి. మామిళ్ల ఈశ్వరయ్య. క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మగుంట ఈశ్వరయ్య. రఘురాం రెడ్డి. రోశయ్య. మోదుగల పెంచలయ్య. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కత్తి అయ్యవారయ్య. భాస్కర్ రెడ్డి. శెట్టిపల్లి నరసింహులు. బాల మునయ్య. గోశాల నరసింహులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird