

దేవిపట్నం ప్రెస్ నోట్:VRM Media దుర్గా ప్రసాద్
రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో పి. గొందూరు గ్రామంలో స్వయంభుగా వెలసిన మాతృశ్రీ గండి పోశమ్మ తల్లి ఆలయం కు సంబంధించి గ్రామస్థులకు చాలానే అనుమానాలు వున్నాయని దీనిపై జనసేన పార్టీ గ్రామ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు చారపు వెంకట రాయుడు, దృష్టికి తీసుకెళ్తామని తెలియచేసారు.
2019 ముందు వరకు పోశమ్మ తల్లి గుడి నికర ఆదాయం ఎంత.2019వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు నుంచి 2024 వరకు ఆలయ ఆదాయం ఎంత ఆలయ అభివృద్ధికి ఎంత ఖర్చు చేసారు. ఎం అభివృద్ధి చేసారు.ఆలయ బ్యాంక్ ఖాతా నుంచి 2019నుంచి 2024వరకు ఎవరి ఎవరి ఖాతాకు ఎంత జామ చేశారు ఎందుకు చేసారు అనేదానిపై పూర్తి వివరణ కావాలని ఆలయ ఆదాయం పక్కదారి పట్టించే విధంగా చాలా కార్యక్రమాలు జరిగాయాన్ని అభివృద్ధి చూస్తే శూన్యమని చూస్తే అర్ధమవుతుంది…సదరు ఆలయ అవకతవకలపై నూతన ఆలయ చైర్మన్ గారిచే నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి మిరియాల శిరీష దేవి గారి ద్వారా దేవా దయ శాఖ మినిష్టర్ వారి దృష్టికి తీసుకెళ్తామని ఎందుకంటె రానున్న రోజుల్లో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన దేవాలయం నిర్మాణం మొదలు అవ్వబోతుంది. కాబట్టి ఆలయ నిర్మాణం ఎటువంటి లోటు పాట్లు లేకుండా ఆలయ ఆదాయాన్ని దానికి అవ్వడం అని పక్కదారి పట్ట కుండా ఉండాలని దీనిపై గ్రామస్థులకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్తామని తెలియచేసి కచ్చితంగా ఆదాయ లెక్కలు అభివృద్ధి వాడిన లెక్కలు నిజనిర్ధారణ జరగాలని తెలియ చేస్తున్నాము.