విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు
బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులతో కలిసి మంగళవారం విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు
గోకవరం సీఎండీ లే అవుట్ నుంచి సోమవారం రాత్రి కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు విజయవాడ బయలుదేరి వెళ్లారు.
అనంతరం మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయం వద్ద సిబ్బంది కంబాల శ్రీనివాసరావు గారు అండ్ టీంకీ ప్రత్యేక అంతరాలయ దర్శనం కల్పించారు. అనంతరం పండితులు వేద ఆశీర్వాదాలు అందించారు.