భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ (org) ఎన్. మధుకర్ గారిని విజయవాడ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన ఛాంబర్ లో
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు గారు రంపచోడవరం, జగ్గంపేట, రాజానగరం మూడు నియోజకవర్గాల్లో పార్టీ అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలు, ప్రజా సేవా కార్యక్రమాలు గురించి ఆయనకు వివరించారు. పలు అంశాల గురించి చర్చించారు.
ఈ కార్యక్రమంలో రాజానగరం బీజేపీ మండల అధ్యక్షులు ఆళ్ల శివ నాగరాజు, గోకవరం ఉపాధ్యక్షులు కర్రీ వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు వరసాల ప్రసాద్, దాసరి ధర్మరాజు, బత్తుల నానాజీ, పెద్దాడ వెంకన్న దొర, కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, అచ్చారావు,నాగ రమేష్, కర్రి మణికంఠ, దోసపాటి సుబ్బారావు, పద్దరాజు, జాజుల నరసింహమూర్తి, చింతల కన్నారావు, రాయపాటి సత్యనారాయణ, తాటికొండ సురేష్, ఆనం చెల్లరావు, మండే గౌతమ్, మందపాటి సతీష్, పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…