Vrm Media ప్రతినిధి



ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఓటు వినియోగంపై అవగాహన కలిగివుండాలని ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే దానికి పునాది ఓటు హక్కు మాత్రమే అని, నిజాయితీ గా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి అని,మనం వేసే ఓటే రేపటి భవిష్యత్తు అని అందుకే చిత్రాల ద్వారా ఓటు పై అవగాహన కల్పించడమే తన ఉద్దేశ్యమని పేర్కొంది.
ఒకవైపు విద్యార్థిని గా విద్యనభ్యసిస్తూనే ప్రస్తుత సామాజిక అంశాలపై తనకున్న చిత్రలేఖనం ద్వారా చిత్రాలను వేస్తున్నానని,వీటి ద్వారా కొంత అవగాహన కలిగిన తన ఉద్దేశ్యం నెరవేరినట్లేనని, చిత్రలేఖనం లో ఇంకా నైపుణ్యం సాధించి, భవిష్యత్తు లోమంచి చిత్రాలతో అవగాహన కల్పిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది.