ఫోటోగ్రాఫర్ pc శేఖర్ కు జాతీయస్థాయిలో వెండి పతకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ శ్రీ pc శేఖర్ ఆదివారం జరిగిన నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ పోటీల్లో నిజామాబాద్ ‘కైతా లంబాడి’ ఛాయాచిత్రానికి గాను వెండి పతకం, ప్రశంసా పత్రం అందుకున్నారు. తెలుగు ఆర్ట్ ఫోటోగ్రాఫి, వివిడ్ ఫోటోగ్రఫీ సొసైటీ నిర్వహించిన ఈ వర్క్షాప్లో ఆయన తీసిన చిత్రం ఉత్తమంగా నిలిచింది. గతంలోనూ జాతీయస్థాయి పోటీల్లో pc శేఖర్ నగదు పురస్కారాలు గెలుచుకున్నారు.