
ఒంటిమిట్టలో ఆరవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష
సిద్ధవటం తెలుగుదేశం పార్టీ నాయకురాలు. కోటపాడు సుబ్బమ్మ
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 11
సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లా రాయచోటిలో చేర్చడం బాధాకరమని సిద్దటం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు కోటపాడు సుబ్బమ్మ. మహిళా అధ్యక్షురాలు కమల్ బి అన్నారు. సిద్ధవటం నుండి రాయచోటికి వెళ్లాలంటే 100 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేయాలి అదే కడప అయితే 25 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఒంటిమిట్ట సిద్దపట్టం ప్రజలు కలెక్టర్ ఆఫీస్ కు పోవాలంటే టైం ప్రకారం బస్సులు దొరకవు ఇక్కడ నుండి రాయచోటికి వెళ్లేసరికి ఆఫీసులు కూడా మూతపడతాయి వికలాంగులకు. వృద్ధులకు మహిళలకు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం. చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట సిద్ధపటం మండలాలను దృష్టిలో ప్రజల సౌకర్యార్థము ఈ రెండు మండలాలను కడప లోనే ఉంచాలని. కాకపోతే రాజంపేట జిల్లా కేంద్రంగా చేసిన మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. సిద్ధపటం మండలాల గురించి ఆలోచించాలన్నారు.