కొంతమూరు నాగమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు
VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం
జాతర మహోత్సవాలకు కంబాల 20,000 రూపాయలు విరాళం
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు
తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు గ్రామంలో గురువారం జరిగిన శ్రీ నాగమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తొలిత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ జాతర ఉత్సవాలకు కంబాల శ్రీనివాసరావు గారు 20,000 రూపాయలు విరాళం అందజేశారు..
ఈ కార్యక్రమంలో దాసరి ధర్మరాజు, బత్తుల నానాజీ, పెద్దాడ వెంకన్న దొర, కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, దోసపాటి సుబ్బారావు, తాటికొండ సురేష్, అంబటి శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.