VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట జనవరి 2
ఒంటిమిట్ట మండలం.రాజముద్ర వేసినటువంటి.పట్టాదారు పాసు పుస్తకాలలో పాత పాసుబుక్కుల స్థానంలో కొత్త పాస్ పుస్తకాలు తీసుకోవాలి పాత పాస్ పుస్తకాలు ఆఫీసులో అందజేయాలి.దర్జీపల్లి మరియు నారాయణరాజుపేట గ్రామాలలో పంపిణీ జరుగును.
జనవరి6 తేదీన దర్జీపల్లి లో రామాలయం దగ్గర 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ సభలో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు.
జనవరి 8వ తేదీన నారాయణరాజుపేట సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పాస్ పుస్తకాలు పంపిణీ జరుగును కావున ఈ రెండు గ్రామాల వారు పాత పాస్ పుస్తకాలను తీసుకువచ్చి వాటి స్థానంలో కొత్త పాస్ పుస్తకాలను తీసుకువెళ్లాలని ఒంటిమిట్ట తాసిల్దార్ దామోదర్ రెడ్డి తెలిపారు.

