అన్నమయ్య జిల్లా రిపోర్టర్
రెడ్డిశేఖర్ బాబు (దావన్ )
తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లాను మూడుగా విభజించడం కేవలం పరిపాలనా నిర్ణయం కాదు ఇది పార్లమెంటు-కేంద్రిత రాజకీయ వ్యూహానికి అడుగుగా చూడాలి. ఒకే రాజంపేట పార్లమెంట్ పరిధిలో అన్నమయ్య, తిరుపతి, వై.ఎస్.ఆర్ కడప
మూడు జిల్లాలు కావడం వల్ల
విస్తృత ప్రాంత సమన్వయం క్యాడర్ బాండింగ్ ఒకే రాజకీయ దిశ అత్యవసరంగా మారాయి ఈ దశలో యువకుడు & టీడీపీ రాష్ట్ర కార్యనిర్వారిక కార్యదర్శి & టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు & రాయచోటి టీడీపీ సీనియర్ నాయకుడు అయిన సుగవాసి ప్రసాద్ బాబును కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేయడంతాత్కాలిక రాజకీయ అవసరం కాదు రాబోయే 5–10 ఏళ్ల రాజకీయ నిర్మాణానికి పెట్టుబడి అని అర్థమవుతోంది.మూడు జిల్లాల్లో క్యాడర్ను ఒకే గొడుగు కిందకి తేవడంపార్లమెంటు స్థాయిలో బలమైన ఓటు ట్రాన్స్ఫర్
యువత,ఫస్ట్టైం ఓటర్లపై ఫోకస్ “ఒక పార్లమెంటు – ఒక టీమ్” అనే భావన బలపరచడం” లక్ష్యం 2029 నాటికి రాజంపేట పార్లమెంట్ పూర్తిగా పార్టీ ఆధీనంలోకి తీసుకురావడం 2032 ఎన్నికల వ్యూహం పార్లమెంటుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడర్షిప్ పైప్లైన్ రెడీ చేయడం జిల్లాల మధ్య అంతర్గత పోటీ కాకుండా సహకారం స్థానిక నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే విధానం ప్రాంతాన్ని స్థిరమైన రాజకీయ బేస్గా మార్చడం లక్ష్యం 2032 నాటికిరాజంపేట పార్లమెంట్ TDPకు సేఫ్ జోన్గా మార్చడం మూడు జిల్లాల్లో పార్టీకి దీర్ఘకాల రాజకీయ ఆధిపత్యం సాధించడం ఈ నిర్ణయం ద్వారా TDPఒక పార్లమెంట్ మూడు జిల్లాలు – ఒక దిశ అనే మోడల్ను అమలు చేయాలని చూస్తోంది అంటే ఇది ఒక వ్యక్తి నియామకం కాదు 2029 & 2032 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఒక దీర్ఘకాల రాజకీయ వ్యూహ నిర్ణయం.
