డాక్టర్ భావన రెడ్డి ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో
VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 13
ఒంటిమిట్ట మండలం. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మంటపంపల్లిun సచివాలయం లొ గల మల్లంపేట హరిజనవాడ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ భావన రెడ్డి ఆధ్వర్యంలో సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు స్కబ్ టైఫస్ వ్యాధి గురించి అవగాహన కల్పించడం జరిగింది. డాక్టర్ భావన గారు మాట్లాడుతూ స్కబ్ టైఫస్ వ్యాధి చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.PHN వెంకట సుబ్బమ్మ గారు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. సూపర్ వైజర్ భాస్కర్ రెడ్డి దోమల ద్వారా వ్యాపించు వ్యాధుల గురించి తెలియ జేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో CHO చంద్రిక,ANM సరోజ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.
