VRM Media News
సత్తుపల్లి ప్రతినిధి
26-01-26(సోమవారం) సత్తుపల్లి పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ గారు 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ గారు, మున్సిపల్ కమిషనర్ నరసింహ గారు పాల్గొన్నారు.
అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద, గాంధీజీ విగ్రహం వద్ద కూడా జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్మికులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు

