తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామానికి చెందిన ఎత్తుల జయంతి అనే మహిళా 8 నెలల గర్భిణీ ఊపిరితిత్తులో సమస్య వచ్చి బాధపడుతుంది. వైద్య ఖర్చులకోసం సహాయం అందించాలని బంధువులు గురువారం రాత్రి
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి వద్దకు వచ్చి కోరారు.
స్పందించిన ఆయన తక్షణమే వైద్య ఖర్చులకు పదివేల రూపాయలు బందువులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..