VRM మీడియా ప్రతినిధి చిన్నంశెట్టి రాంబాబు ఖమ్మం
వెలుగుమట్ల భూదాన్ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం విధితమే, ఈ బాధితుల్లో అధికంగా చిన్నపిల్లలు వయోవృద్ధులు, గర్భిణీలు, వికలాంగులు ఉన్నారు, ఇందులో భాగంగా వారికి సరైనా సదుపాయాలు లేకపోవడంతో, శుక్రవారం రాత్రి పూర్ణిమ అనే ఐదు నెలల చిన్న పాపకు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అదేవిధంగా రాష్ట్ర బిజెపి నాయకులు దేవకి వాసుదేవరావు, హాస్పిటల్ కి వచ్చి చిన్నారికి అందించే వైద్యం గురించి తెలుసుకొని తల్లిదండ్రులను పరామర్శించారు, అదేవిధంగా బిజెపి సీనియర్ నాయకులు బండి సంజయ్ చరవాడిలో తల్లిదండ్రులతో మాట్లాడారు, అదేవిధంగా డాక్టర్ను పాపకు మెరుగైన వైద్యం అందించగలరని కోరారు, అత్యవసరం అయితే పాపను హైదరాబాద్ తరలించాల్సిందిగా కోరారు.
