VRM media అయినవిల్లి భద్రం
👉 కోరుకొండ మండలం కోరుకొండ శాసనసభ్యుల వారి కార్యాలయంలో *రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ * ఉదయం నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వద్ద నుండి విద్యా, వైద్యం, వ్యవసాయం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైనేజి లు వంటి పలు రకాల సమస్యలు, పనులకు సంబంధించి అర్జీలు స్వీకరించడం జరిగింది.. మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన కూటమి నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, ప్రజలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే శాసనసభ్యులు గ్రామాల్లో గల ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకుని సంక్షేమ పధకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందుతున్నాయా లేదా , వారికి కావలసిన సదుపాయాలు, సౌకర్యాలు గురించి ప్రజల అవసరాల మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు..

