మాంగళ్య షాపింగ్ మాల్ యాజమాన్యం, ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ప్రారంభించింది , ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ తెలుగు సిని కథనాయిక శ్రీలీల విచ్చేశారు, వారు మాట్లాడుతూ ముందుగా అందరికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు, అలాగే మూడు రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగదారుల సేవలు అందుకుంటున్న షాపింగ్ మాల్ మాంగల్య షాపింగ్ మాల్ అని చెప్పారు, కస్టమర్ల నమ్మకాన్ని పొందటమే కాకుండా, అతి తక్కువ ధరలకు, నాణ్యమైన,మన్నికైన దుస్తులు సరసమైన ధరలకు కస్టమర్లుకు అందించడంలో ముందుంటుందని తెలియజేశారు, అదేవిధంగా మూడు రాష్ట్రాల్లోనూ అతి తక్కువ రోజుల్లోనే కస్టమర్ల ఆధారాభిమానాలను పొందిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాంగల్య షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు పి ఎన్ మూర్తి, చైర్మన్ నమశివాయ, షాపింగ్ మాల్ డైరెక్టర్లు, నగర మేయర్ పూనుకొల్లు నీరజ, కార్పొరేటర్, తదితరులు పాల్గొన్నారు.

