vrm media ప్రతినిధి రాంబాబు చిన్నంశెట్టి

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ తల్లాడ మండల శాఖ ఆధ్వర్యంలో తాహసిల్దార్ గారికి మెమోరాండం సమర్పణ…
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చకుండా సామాన్య ప్రజలను మోసం చేస్తూ బూటకపు హామీలతో పరిపాలన కొనసాగిస్తుందని, మోసపూరిత హామీలతో ప్రజల్ని మోసం చేయడాన్ని నిరసిస్తూ ఇచ్చిన హామీల్లో భాగంగా వృద్ధాప్య వితంతు పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అదేవిధంగా ఉచిత కరెంటు ఇవ్వాలని, గ్యాస్ సబ్సిడీ ఎకౌంట్లో వెంటనే వేయాలని, ఆడపిల్లల పెళ్ళికానుక తులం బంగారం హామీ అమలు చేయాలని, మహిళలకు 2500 నిరుద్యోగులకు 2000 రూపాయలు వెంటనే విడుదల చేయాలనీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ సూచనతో తల్లాడ తహసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమం లో
భారతీయ జనతా పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు చల్లా నాగులు. మండల ప్రధాన కార్యదర్శులు రాయల రమేష్ పెరిక కిరణ్. మండల sc సెల్ అధ్యక్షులు వేము అశోక్. నాయకులు సమ్మెట రాంబాబు పాల్గొన్నారు..