[ad_1]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్) ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తాద్ భగత్ సింగ్)తో ప్రేక్షకులను పలకరించారు. ఆయన తదుపరి సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా కమిటై ఉన్నారు. ఈ ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు పవన్ 'ఓజీ-2' చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఊహించని విధంగా 'బ్రో-2' తెరపైకి వచ్చింది.
పవన్ కళ్యాణ్ నటించిన ఫాంటసీ కామెడీ ఫిల్మ్ 'బ్రో'. 2023లో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ని బాగా అలరించింది. పవన్ ని చూపించిన తీరుకి, ఆయన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు 'బ్రో' సినిమాకి సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్వయంగా సముద్రఖని చెప్పడం విశేషం.

సముద్రఖని(సముతిరకని) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'కార్మేని సెల్వం'(కార్మేని సెల్వం). ఏప్రిల్ 3న విడుదల. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో 'బ్రో సీక్వెల్' గురించి సముద్రఖని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"బ్రో-2 స్టార్ట్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది" అని అడగగా.. "నేను కూడా వెయిట్ చేస్తున్నాను. స్క్రిప్ట్ రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే టేకాఫ్" అని సముద్రఖని చెప్పుకొచ్చారు.
బ్రో సీక్వెల్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపడానికి, ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్తుందని అర్థమవుతోంది.
'ఓజీ' సీక్వెల్ కోసం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి.. బ్రో సీక్వెల్ న్యూస్ బిగ్ సర్ప్రైజ్ అని చెప్పవచ్చు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird