VRM media అయినవిల్లి భద్రం
దేవీపట్నం:
రంపచోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ కాకినాడలో నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి దేవీపట్నం మండలం నుండి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లి సందడి చేశారు.
శ్రీనివాస్ యాదవ్ దంపతులను మర్యాదపూర్వకముగా కలిసిన నాయకులు, వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న శ్రీనివాస్ యాదవ్ పట్ల మండల నాయకులు తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నాయకులతో కాసేపు ముచ్చటించారు,
ఈ కార్యక్రమంలో గోళ్ళ చంటిబాబు మండల అధ్యక్షులు
మాగాపు బాబురావు (సొసైటీ అధ్యక్షులు)
కీర్తికి గంగరాజు (ప్రధాన కార్యదర్శి)
ముండ్రు మధుసూదన్ రావు (మాజీ మండల అధ్యక్షులు)
సోదే వెంకన్న (ఎస్టీ సెల్ అధ్యక్షులు)
కుటుంబ రెడ్డి (ఐటీడీపీ కార్యదర్శి) మిర్తివాడ వీరబాబు కార్యదర్శి
సీనియర్ నాయకులు రేలంగి రాంబాబు,బూత్ ఇంచార్జ్ పుట్టపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird