
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఏపీ రాజధానిగా అమరావతిని (అమరావతి) ఖరారు చేస్తూ కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన సీఎం చంద్రబాబు, (చంద్రబాబు) మంత్రి నారా లోకేష్ (nara lokesh).. ఇవాళ లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో స్పందించారు. ముఖ్యంగా ఈ బిల్లు ఆమోదాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా తిలకించిన లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా తమదైన శైలిలో స్పందించారు. రేపు రాజ్యసభలోనూ ఈ బిల్లు పాస్ అయితే ఇక చట్ట సవరణలే.
అమరావతి చట్టబద్దత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చను టీవీల్లో తిలకించిన లోకేష్.. అనంతరం చప్పట్లు కొడుతున్న ఫొటోను ట్వీట్తో పాటు షేర్ చేశారు. అమరావతి చరిత్ర-సంస్కృతి, ఆవశ్యకత సభ్యలు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడుచుకున్న ప్రదేశం. కేంద్రప్రభుత్వం, దేశంలోని వివిధ పార్టీల మద్దతుగా నిలవడం ఐదుకోట్ల ఆంధ్రప్రజల ఆకాంక్షకు అద్దం పట్టి ఉంది. లోక్ సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైందని, దేశ రాజధాని ఢిల్లీలో ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో చరిత్ర సృష్టించిన అమరావతి చట్టబద్ధతత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సరి చేయడం నిదర్శనమన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినీ ఆపలేదని తెలిపారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం అంటూ ముగించారు.

#చరిత్రాత్మక అమరావతి తీర్మానం
అమరావతి చట్టబద్దత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశాను. ఉత్కంఠ రేపింది. అమరావతి చరిత్ర-సంస్కృతి, ఆవశ్యకత సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వివిధ పార్టీలకు మద్దతుగా… pic.twitter.com/71V1Fa4P8q– లోకేష్ నారా (@naralokesh) ఏప్రిల్ 1, 2026
#చరిత్రాత్మక అమరావతి తీర్మానం
ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఈరోజు లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు గౌరవంగా భావిస్తున్నాను. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా… pic.twitter.com/eDCXpaGWp5– ఎన్ చంద్రబాబు నాయుడు (@ncbn) ఏప్రిల్ 1, 2026
అనంతరం సీఎం చంద్రబాబు కూడా అమరావతి బిల్లు ఆమోదాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకని తెలిపారు. ఈరోజు లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు గౌరవంగా భావిస్తున్నారన్నారు. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడింది. రైతుల త్యాగానికి, ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ మైలురాయి, అమరావతి ఇక అజేయం..అజరామరం. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామన్నారు. సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.