ది.02.04.2024 గురువారం
పోలవరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా ఈరోజు పోలవరం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌ. అబ్దుల్ నజీర్ కి పోలవరం ప్రాజెక్టు వద్ద దుశ్శాలువ కప్పి పుష్ప గుచెం తో సాదర స్వాగతం పలికిన రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ .
అనంతరం పోలవరం ప్రాజెక్టు లో జరుగుతున్న పనులకు సంబంధించి గౌ. గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ,జలవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు తో మరియు జిల్లా అధికారులు తో కలసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేలా చేసి రైతులకు పంటలకు నీరు సకాలంలో అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలియచేశారు.
వీరితో పాటుగా ఈ పర్యటనలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు , జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్పీ ,మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


