VRM media అయినవిల్లి భద్రం
అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం పట్ల పోలవరం జిల్లా రంపచోడవరం ప్రాంతానికి చెందిన దేవీపట్నం మాజీ మండల అధ్యక్షులు మారిశెట్ల వెంకటేశ్వరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్రానికి సమగ్ర అభివృద్ధికి పునాది వేస్తుందని తెలిపారు. ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన పరిపాలనతో అమరావతి దేశంలోనే ఆదర్శ రాజధానిగా అవతరించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అమరావతి అభివృద్ధి వలన దేశీయ, విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షితమై పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగావకాశాలు కలుగుతాయని చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తూ, అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రజల ఆశలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అమరావతి బిల్లు ఆమోదంతో రాష్ట్రవ్యాప్తంగా ఆనంద వాతావరణం నెలకొంది.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird