[ad_1]
అంతర్జాతీయ
ఓయ్-కొరివి జయకుమార్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన సరఫరాపై పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో పెరుగుతున్న ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు ఎనర్జీ సేవింగ్ చర్యలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్ను రోజూ సాయంత్రం 6 గంటలకే ఆదేశాలు జారీ చేసింది.
షాపింగ్ మాల్స్, ఆఫీసులకు పరిమిత సమయాలు..
అలానే ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కార్యాలయాల పని గంటలను కూడా తగ్గించింది. ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఆఫీసులు ఇకపై 4 గంటలకే మూతపడతాయి. దీంతో విద్యుత్ వినియోగం తగ్గుతుందని అధికారులు. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా మార్పులు చేశారు. బ్యాంకింగ్ లావాదేవీలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అనుమతించబడతాయి. బ్యాంకులు సాయంత్రం 4 గంటలకే మూతపడేలా నిర్ణయించారు.

అత్యవసర సేవలకు మినహాయింపులు..
అయితే, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. హోటళ్లు, ఫార్మసీలు, ఆసుపత్రులు, అత్యవసర సేవలు, అలాగే నిత్యావసర వస్తువుల మార్కెట్లు ఈ ఆంక్షలకు లోబడి ఉండవు. ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఈ కీలక నిర్ణయాలు తారిక్ రెహమాన్ ఆమోదం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్నట్లు సమాచారం. దేశ ఆర్థిక, ఇంధన నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఈ చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు.
భారత్ సహాయం...
మరోవైపు ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు భారతదేశం ఇప్పటికే బంగ్లాదేశ్కు 5,000 టన్నుల డీజిల్ను సరఫరా చేసింది. ఈ సహాయం తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించుకుని, తాత్కాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరింత సహాయం కోరింది. రాబోయే నాలుగు నెలల్లో అదనంగా 50,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేయడానికి బంగ్లాదేశ్ భారత్ను అభ్యర్థించింది. ఈ అభ్యర్థనపై భారత ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, బంగ్లాదేశ్ విన్నపాన్ని చూస్తున్నామని చెప్పారు. అలాగే, ఇంధన అవసరాల కోసం బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా శ్రీలంక, మాల్దీవులు వంటి ఇతర పొరుగు దేశాలు కూడా భారత్ను ఆశ్రయిస్తున్నాయని పేర్కొన్నారు. మరి ఈ కొత్త నిబంధనలతో ప్రజల దైనందిన జీవనశైలిలో మార్పులు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే దీర్ఘకాలంలో ఇంధన ఆదా చర్యలు దేశ ఆర్థిక స్థిరత్వానికి ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird