
తెలంగాణ
ఓయి-లింగారెడ్డి గజ్జల
తెలంగాణ విద్యావ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా నోటిఫికేషన్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ప్రీ-ప్రైమరీ’ (పూర్వ ప్రాథమిక) విద్యపై భారీ అడుగులు వేస్తోంది. ప్రైవేటు స్కూళ్లకు వెళ్లలేని పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎల్జీ, యూకేజీ తరగతులను తెస్తూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 3,000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో విజయవంతంగా నడుస్తున్న ఈ విధానం ఇప్పుడు మరింత విస్తరిస్తోంది. బడ్జెట్లో ప్రకటించిన దానికంటే మిన్నగా, దాదాపు 3,000 స్కూళ్లలో యూకేజీ తరగతులు దానిని ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలోనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల (DEO) నుండి అందిన నివేదికల ఆధారంగా ఈ పాఠశాలల జాబితాను ఖరారు చేస్తారు.

ప్రతి పంచాయతీకి ఒక ‘ప్రీ-ప్రైమరీ’ స్కూల్..
రాష్ట్రంలోని 12,700 గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి కనీసం ఒక పాఠశాలనైనా ప్రీ-ప్రైమరీ కేంద్రంగా మార్చాలన్నది ప్రభుత్వ బృహత్తర లక్ష్యం. ప్రస్తుతం 1,362 పాఠశాలల్లో ఈ విధానం అమలులో ఉండగా, చిన్నారుల సంరక్షణ కోసం ఆయాను, విద్యాబోధన కోసం ప్రత్యేక ఇన్స్ట్రక్టర్ను నియమించారు. సమగ్ర శిక్షా ప్రాజెక్టు నిధులతో వీరికి గౌరవ వేతనాలు (ఆయాకు ₹6,000, ఇన్స్ట్రాక్టర్కు ₹8,000) అందజేస్తున్నారు. తాజా నిర్ణయంతో మరో 6,000 మందికి ఉపాధి లభించనుండటం విశేషం.
హైదరాబాద్ ‘క్యూర్’ ప్రాంతాలనూ విస్తరణ..
నగర ప్రాంత విద్యార్థుల కోసం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో కూడా ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఎంపిక చేసిన 28 ప్రాంతాల ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట విద్యనందించేలా ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలల్లోనే ప్రభుత్వ బడుల్లోనూ నర్సరీ, ఎల్కేజీలను కూడా ప్రవేశపెట్టాలన్న డిమాండ్ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోంది.