Home ట్రెండింగ్ గంటన్నరలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! | హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైల్ కారిడార్ అమరావతి మీదుగా 778 కి.మీ పొడవున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్. – VRM MEDIA

గంటన్నరలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! | హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైల్ కారిడార్ అమరావతి మీదుగా 778 కి.మీ పొడవున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్. – VRM MEDIA

by VRM Media
0 comments
గంటన్నరలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! | హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైల్ కారిడార్ అమరావతి మీదుగా 778 కి.మీ పొడవున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకు ఏపీ రాజధాని అమరావతితో లింకు ఏర్పడనుంది. మొదట హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌లో మాత్రమే అమరావతిని కేంద్రం చేర్చింది. తాజా ప్రతిపాదనల మేరకు అమరావతితో లింక్ చేస్తూ మ్యాప్‌లో చేర్చింది. ఈ రైలు కారిడార్ రాజధాని ప్రాంతంలోని పశ్చిమ బైపాస్, ఎన్-6 రోడ్డు గుండా సాగనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 90 నిమిషాల్లో, అమరావతి నుంచి చెన్నైకి అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు.

దక్షిణాదిన రెండు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకు ఏపీ రాజధాని అమరావతితో లింకు ఏర్పడనుంది. మొదట హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌లో మాత్రమే అమరావతిని కేంద్రం చేర్చింది. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు అమరావతిని లింక్ చేస్తూ ఆమోదించి మ్యాప్‌లో చేర్చింది. దీని వల్ల అమరావతి నుంచి గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్‌ ఏర్పాటవుతుంది. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారపేట, బెంగళూరు, మాండ్య మీదుగా మైసూరుకు మరొకటి వస్తుంది. ప్రస్తుతం అహ్మదాబాద్‌-ముంబై మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణం దేశంలో వేగంగా జరుగుతోంది. నేషనల్‌ నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారానే వివిధ కారిడార్ల డీపీఆర్‌ల రూపకల్పన, మెటీరియల్‌ ప్రొక్యూర్‌మెంట్‌, కారిడార్‌ నిర్మాణం వంటి పనులు పూర్తి అవుతున్నాయి. ఇటీవలి బడ్జెట్‌లో కేంద్రం కొత్తగా హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను చేర్చింది. తెలంగాణ, ఆంధ్ర తమిళనాడు, కర్ణాటకలకు ఉపయోగపడేలా 2 కారిడార్లను అందించింది.

హైదరాబాద్-చెన్నై-హై-స్పీడ్-రైల్-కారిడార్-ఒక-ప్రణాళిక-బుల్లెట్-ట్రైన్-ప్రాజెక్ట్-సుమారు-778-కిమీ-పొడవు-ద్వారా

ఏపీ ప్రతిపాదనలు… అమరావతితో అనుసంధానం

కేంద్ర ప్రభుత్వం రూ. 2,245 కోట్లతో అమరావతికి రైల్వే లైన్‌ను అందించింది. తెలంగాణ లోని ఎర్రుపాలెం నుండి గుంటూరు జిల్లా నంబూరు వరకు సుమారు 57 మేర కొత్త లైన్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై సుమారు 3 పొడవైన ఐకానిక్ రైల్వే వంతెన నిర్మించబడుతుంది. ఇది అమరావతి ప్రాంతంలోనే అతిపెద్ద రైల్వే వంతెన, పర్యాటక ఆకర్షణగా నిలవనుంది. కాగా, కేంద్రం ఇచ్చిన కారిడార్‌లో ఒకటి హైదరాబాద్‌-శంషాబాద్‌-నల్గొండ-సూర్య పేట-కోదాడ-నందిగామ-అమరావతి/ విజయవాడ-గుంటూరు- చీరాల-ఒంగోలు -నెల్లూరు- నాయుడుపేట-శ్రీసిటీ-చెన్నై. అదే విధంగా మరొకటి మైసూరు- మాండ్య-బెంగళూరు-బంగారుపేట -చిత్తూరు-అరక్కోణం-పూనమల్లె-చెన్నై.
వచ్చే ఏడాది నాటికి వీటి డీపీఆర్‌లు రూపొందించి.. నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు సమాచారం. 2029కి ముందే శంకుస్థాపనలు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

2,801 Views

You may also like

Leave a Comment