తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం గ్రామంలో
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో
భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం అంగరంగ, వైభవంగా జరిగాయి.
గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ వద్ద 70 అడుగుల పార్టీ జెండాను కంబాల శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
అనంతరం గోకవరం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం గోకవరం నుంచి రాజమండ్రి వెళ్లే రహదారిలోని ఇర్లంకపల్లి జంక్షన్ సమీపంలో 70 అడుగుల పార్టీ జెండాను ఆవిష్కరించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అనంతరం స్వీట్ పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వరసాల ప్రసాద్, బత్తుల నానాజీ, దాసరి ధర్మరాజు, ఉంగరాల మణిరత్నం, పెద్దాడ వెంకన్న దొర, కరిబండి వెంకటేశ్వరరావు, రాయపాటి సత్యనారాయణ, ఆనం చెల్లరావు, దేశాల నరేష్, నాగ రమేష్, కంబాల త్రిమూర్తులు, మళ్ల అది శేషు, దొరబాబు, కందికట్ల మూర్తి, కేబుల్ రాజు, ఆదం మణికంఠ, నెల్లి శ్రీను, తుమ్మల బుజ్జి, పదిలం చక్రారావు, మందపాటి సతీష్, పలకం శెట్టి శ్రీను,కాకర దుర్గారావు, నండూరి దుర్గారావు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.