
తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క ఎండలు దంచి కొడుతున్న వేళ వర్షాలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో ఇటీవల వాతావరణం ఎవరికీ అర్ధం కాకుండా మారింది. ఎండలు, వర్షాలతో కూడిన వాతావరణం కనిపిస్తుంది. ఇది ఎండల ధాటికి ఇబ్బంది పడుతున్న వారికి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టాయి, రైతులు వర్షాల దెబ్బకు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన
ఒకపక్క ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇంకోవైపు వర్షాలు కూడా గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల వాతావరణ శాఖ తాజాగా ఒక కీలక ప్రకటన.హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన ప్రకారం, నేడు మంగళవారం నుంచి ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఈ మూడు రోజులు ఆయా జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ జిల్లాలలో వర్షాలు.. జాగ్రత్త
ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాలలో భారీ జల్లులతో పాటు ఈదురు గాలులు, వడగళ్లు కూడా పడతాయని అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేప్పుడు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
ఏప్రిల్ 10వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎండలు
రైతులు, ప్రయాణికులు సైతం ప్రస్తుత వాతావరణాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు. మూడు పాటు వర్షాలు ముగిశాక తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారుతుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. ప్రస్తుత ఉష్ణోగ్రతలకు మించి 2 నుండి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మార్పుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండటం.