
అంతర్జాతీయ
ఓయ్-కొరివి జయకుమార్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదిరిపోతున్న వేళ.. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ పై మరోసారి విరుచుకుపడింది. హెజ్బొల్లాకు చెందిన లక్ష్యాలను గురి చేస్తూ భారీ స్థాయిలో వైమానిక దాడులు జరిగాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100కి పైగా ఎయిర్ స్ట్రైక్స్ జరగడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 1982 లెబనాన్పై ఇదే అతిపెద్ద దాడిగా స్థానిక అధికారులు పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం. ఈ ఒప్పందానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది. అయితే ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పష్టం చేసింది.
కాగా బీరుట్ దక్షిణ శివారులు, దక్షిణ లెబనాన్, తూర్పు బెకా లోయ ప్రాంతాలు ఈ దాడులతో దద్దరిల్లాయి. ఇవన్నీ హెజ్బొల్లా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలే కావడం లేదు. కమాండ్ అండ్ కంట్రోల్స్, ఆయుధ గిడ్డంగులు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో ప్రముఖ మతపెద్ద సాదిక్ అల్ నబుల్సీ మృతి చెందినట్లు సమాచారం.

ఈ వైమానిక దాడులకు అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం, మరెంతో మంది గాయపడ్డారు. రెడ్క్రాస్ తెలిపిన వివరాల ప్రకారం అంబులెన్సులు, వైద్య బృందాలు నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లెబనాన్లోని ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయని ఆరోగ్య శాఖ.
ఈ ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్లో మృతుల సంఖ్య 1,500 దాటినట్లు అంచనా. వీరిలో 130 మంది చిన్నారులు పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. దేశ జనాభాలో ఐదో వంతుకు సమానమైన 12 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్ శరణార్థి శిబిరాలుగా మారిపోయాయి. ముఖ్యంగా ముస్లిం వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.
ఇక అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా ఈ దాడులను మరింత చర్చనీయాంశంగా మారుస్తున్నాయి. మరోవైపు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్ ప్రాంతీయ శాంతి చర్చల్లో తమ దేశాన్ని కూడా చేయాలని కోరుతున్నారు. ఇదే సమయంలో ఇరాన్ అత్యున్నత నాయకుడు ఖమేనీ హత్య తర్వాత హెజ్బొల్లా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు జరిగాయి. అయితే తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హెజ్బొల్లా నుంచి పెద్దగా స్పందన రాలేదు. “చారిత్రక విజయం సమీపంలో ఉంది” అని ప్రకటించిన ఆ సంస్థ, అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించే వరకు ప్రజలు ఇళ్లకు తిరిగి వెళ్లవద్దని సూచించారు.
ఇజ్రాయెల్బడి సరిహద్దు ప్రాంతాలకు చొరబాటు హెజ్బొల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. భవిష్యత్తులో భద్రతా బఫర్ జోన్ ఏర్పాటు యోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల యుద్ధం ముగిసిన తర్వాత కూడా లక్షలాది మంది తమ ఇళ్లకు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. లెబనాన్లో ఇప్పటికే తీవ్రమైన మానవతా సంక్షోభం. ఆహారం, తాగునీరు, మందుల కొరత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ సంస్థలు అత్యవసర సహాయం సిద్ధమవుతున్నాయి. యుద్ధం విస్తరించే అవకాశాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.