VRM media అయినవిల్లి భద్రం
నేడు రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామం లో SC/ST విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం "పీ.ఎం. సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన" కింద ఉచిత సోలార్ విద్యుత్ అందించే ప్రక్రియ మన నియోజకవర్గంలో రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ రూడ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రారంభించారు.
రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 2883 సోలార్ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం "యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ మోడ్" పద్ధతిలో నిర్వహించబడుతుంది. దీని ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మరియు సంబంధిత సంస్థల సమన్వయంతో సోలార్ వ్యవస్థలను అమర్చడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు ST/SC లబ్ధిదారులు, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird