VRM media అయినవిల్లి భద్రం
అధికారం అండతో తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించిన ఎమ్మెల్యే
సబ్ లీజ్ రాయటం చట్టబద్ధమా, కాదా
సూపర్వైజర్ ని బెదిరించిన కందుకూరు టిడిపి ఎమ్మెల్యే అనుచరులు
కందుకూరు టిడిపి ఎమ్మెల్యే నాగేశ్వరరావు. మేనల్లుడు వేణు గోపాల్ పైన కేస్ నమోదు చేయాలని పార్టనర్ సురేంద్ర డిమాండ్
రంపచోడవరం మండలం.
రంపచోడవరం మండలం చుప్పరిపాలెం గ్రానైట్ క్వారీ సంబంధించిన కందుకూరు టిడిపి ఎమ్మెల్యే నాగేశ్వరరావు బాగోతం ఒక్కొక్కటి వేలుగులోకి వస్తున్నాయి అక్టోబర్ నుంచి లీజ్కి ఇచ్చిన మిషనరీ కంపెనీ విలువెల్ల ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదు. పైగా మిషనరీకి కావలి ఉంచి, మిషనరీకి కావలి ఉంచినా సూపర్వైజర్ని బెదిరించడం వారిపై తప్పుడు కేసులు పెట్టడం పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించడం ఆపై మిషనరీ తాళాలు పగలగొట్టి మిషనరీ వాడుకోవడం వాటిని పాడు చేయటం కంపెనీ యజమాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. సిహెచ్ మరడయ్య సంతకం పెట్టకుండా 2010 నుంచి 2015 వరకు ఉన్నటువంటి ప్రెసిడెంట్ సంతకం పెట్టి మైనింగ్ ఆఫీస్కు లెటర్ ఇచ్చి ఆన్లైన్లో ఉన్న ఫోన్ నెంబర్ మార్చటం దీనిపై సిహెచ్ మరడయ్య స్పందన కోరుతున్నాము.సొసైటీకి ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి ఆడిట్ జరగలేదు. ఇంత జరుగుతున్న సదర ఎమ్మెల్యే అర్ధరాత్రి వేళ క్వారీ నడపడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రోజూ ఒక కొత్త అగ్రిమెంట్ వెలుగులోకి. ఇలా ఎన్ని అగ్రిమెంట్లు చేసుకుంటారు? ఇంకెంత మంది ఇలా బలి అవ్వాలా? అసలు ఎంతమందికి సబ్ లీజులు రాశారు? సబ్ లీజ్ రాయటం చట్టబద్ధమా, కాదా? అసలు ఎమ్మెల్యే ట్రైబల్ ఏరియాలో పని చేయటం ఏంటో క్వారీ సబ్లీస్ తీసుకోవటం సంబంధించిన విషయమా కదా అని పార్టనర్ సురేంద్ర అన్నారు. ఇంత అవకతవకలు జరుగుతున్న గ్రానైట్ క్వారీ పైన ఉన్నత అధికారులు స్పందించి ఎంక్వైరీ చేయాలని సురేంద్ర పత్రిక ముఖంగా కోరుతున్నారు.
రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాం
చుప్పరిపాలెం గ్రానైట్ క్వారీ సంబంధించిన పార్టనర్ సురేంద్రకు జరిగిన నష్టం పైన రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్మరణ్ రాజుకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని సురేంద్ర తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ అధికారి స్పందించి సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరారు


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird