
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం. ఒక ఎండ వైపు మండుతుంటే.. మరో వైపు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాలపై నున్న ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఇతర ప్రాంతాల వడగాల్పులు. రానున్న మూడు రోజులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ను ఆనుకొని ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ. ఇదే సమయంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల వేళ పలు జిల్లాలకు కీలక సూచనలు చేసింది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అమరావతి వాతావరణ కేంద్రం. ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని, ఉత్తర తమిళనాడు పరివాహక ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉంది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయల సీమలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో జల్లులకు అవకాశం ఉందని చెప్పారు. కాగా, రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో భవనాలు భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ, కర్ణాటకలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వాతావరణ కేంద్రం.

వడగాల్పులు.. ఇటు వర్షాలు
కాగా, ఉదయం రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఇక.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య చాలాచోట్ల 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం చూపిస్తుంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఏప్రిల్ 11న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 12వ తేదీ నుంచి పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు.. 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. 13వ తేదీ నుంచ 17 వరకు వాతావరణం పొడిగే ఉండనుంది. ఇక.. అధిక ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని అంచనా వేసింది.