Home ట్రెండింగ్ రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! | విఫలమైన శాంతి చర్చలు మరియు గ్లోబల్ ఆయిల్ సప్లై భయాల కారణంగా భారత రూపాయి డాలర్‌కు 93.28 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. – VRM MEDIA

రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! | విఫలమైన శాంతి చర్చలు మరియు గ్లోబల్ ఆయిల్ సప్లై భయాల కారణంగా భారత రూపాయి డాలర్‌కు 93.28 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. – VRM MEDIA

by VRM Media
0 comments
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! | విఫలమైన శాంతి చర్చలు మరియు గ్లోబల్ ఆయిల్ సప్లై భయాల కారణంగా భారత రూపాయి డాలర్‌కు 93.28 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది.


వ్యాపారం

ఓయి-లింగారెడ్డి గజ్జల

అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు భగ్గుమనడం, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత రూపాయి విలువలపై తీవ్ర ఒత్తిడి ఉంది. సోమవారం (ఏప్రిల్ 13) ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి ఏకంగా 55 పైసలు క్షీణించింది. గత సెషన్‌లో 92.73 వద్ద ముగిసింది, నేడు డాలర్‌తో రూపాయి 93.28 వద్ద ప్రారంభమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. కీలకమైన ఇంధన రవాణా మార్గం ‘హార్ముజ్ జలసంధి’ని అమెరికా నౌకాదళం దిగ్బంధిస్తుందని ఆయన ప్రకటించడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే అన్ని దేశాల నౌకలను అడ్డుకుంటామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేయడంతో, బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 7 శాతం పెరిగి 102 డాలర్లకు చేరింది. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 7:30 గంటల నుంచే ఈ అంక్షలు అమలులోకి రానున్నాయి.

విఫలమైన శాంతి చర్చలు మరియు గ్లోబల్ ఆయిల్ సప్లై భయాల కారణంగా డాలర్‌కు 93 28కి చేరుకోవడంతో భారత రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది.

రూపాయిపై డబుల్ దెబ్బ..

ఒకవైపు చమురు ధరల పెరుగుదల, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న కొత్త నిబంధనలు రూపాయి కదలికలపై ప్రభావం చూపింది.

ఆర్బిట్రేజ్ నిలిపివేత:

బ్యాంకులు తమ షో ఆఫ్ నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (NDF) మార్కెట్‌లోని ఆర్బిట్‌రేజ్ స్థానాలను నిలిపివేయాలని ఆర్‌ఐఐ ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగియడంతో డాలర్ ప్రవాహాలు తగ్గిపోయాయి.

దిగుమతి భారం:

భారత్ తన ఇంధన అవసరాల్లో 80 వరకు దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులోనూ 40 శాతం చమురు హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తుంది. ఇప్పుడు ధరలు పెరగడం వల్ల దేశ దిగుమతి బిల్లు భారమై, కరెంట్ ఖాతా లోటు (CAD) మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్రంప్ హెచ్చరిక.. రాజకీయ చదరంగం

నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల వరకు చమురు ధరలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఆరు వారాల క్రితం ఇరాన్‌పై దాడి చేయాలనే నిర్ణయం వల్ల రాజకీయ పరిణామాలు ఉంటాయని తెలిసిందని, దేశ ప్రయోజనాలను వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు. దీంతో గత వారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు ప్రమాదంలో పడింది.

“రూపాయిపై ఊహాజనిత దాడులను అరికట్టడానికి ఆర్‌బీఐ చేసిన ప్రయత్నాలు తొలి దశలోనే విజయవంతమయ్యాయి. అయితే, ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి” అని షిన్హాన్ బ్యాంక్ ట్రెజరీ హెడ్ కునాల్ సోధాని చెప్పారు.

ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తుంటే, రానున్న రూపాయి మరింత బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి, ఇది సామాన్యుడిపై ధరల భారాన్ని పెంచే ప్రమాదం ఉంది.

2,801 Views

You may also like

Leave a Comment