
అంతర్జాతీయ
-బొమ్మ శివకుమార్
అమెరికా అన్నంత పనీ చేసిందండీ.. ఇరాన్ తో చర్చలు విఫలమైన నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి అమెరికా నెవీ ఫోర్స్.. హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడం ప్రారంభించింది. ఇరాన్ నుంచి వచ్చి పోయే నౌకలను అమెరికా నేవీ అడ్డుకుంటోంది.
సోమవారం రాత్రి 11:01 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. అమెరికా హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ కీలక ఓడరేవులను, ముఖ్యంగా బందర్ అబ్బాస్, చాబహార్లను లక్ష్యంగా చేసుకుని నావికా దిగ్బంధనాన్ని వేగవంతం చేస్తోంది. దౌత్య చర్చలు విఫలమవడంతో ఈ చర్య ఇరాన్తో ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. దిగ్బంధనానికి దగ్గరికొచ్చే ఏ నౌకపైనైనా తక్షణ చర్యలు తప్పవని, అమెరికా బలగాలు వేగంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇరాన్ నావికాదళంలో గణనీయ భాగం ధ్వంసం కావడాన్ని టెహ్రాన్కు గట్టి ఎదురుదెబ్బగా ఆయన అభివర్ణించారు.
చిన్న సైజులో ఉండే ఫాస్ట్ ఎటాక్ షిప్స్ గతంలో పెద్ద ముప్పుగా భావించడం లేదని అందుకే వాటిని లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. ఇవి ఇరాన్ దక్షిణ తీరప్రాంతంలో ఉండి, చమురు ఎగుమతులు, సముద్ర వాణిజ్యానికి అత్యంత కీలకమైనవి.
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జలమార్గాలలో హోర్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో అధిక భాగం ఈ ఇరుకైన జలమార్గం గుండానే సాగుతుంది. ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యం, అనేక దేశాల ఇంధన భద్రతపై ప్రభావం చూపుతుంది.

ఈ దిగ్బంధనం ప్రాంతీయ ఘర్షణ ప్రమాదాన్ని పెంచుతూ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. అమెరికా, ఇరాన్ కఠిన వైఖరిని ప్రదర్శించడంతో, పరిస్థితి ఉద్రిక్తంగా, అనిశ్చితంగా మారింది. ఈ బలమైన వ్యూహాత్మక చర్య ప్రపంచ మార్కెట్లు, ప్రాంతీయ స్థిరత్వానికి అనిశ్చితిని తెచ్చింది. రాబోయే రోజులు ఉద్రిక్తతలు పెరుగుతాయా లేక చర్చల వైపు సాగుతాయా అని నిర్ణయిస్తారు. ప్రపంచం దీనిని నిశితంగా గమనిస్తోంది.