[ad_1]
వ్యాపారం
ఓయి-లింగారెడ్డి గజ్జల
ఉమ్మడి కుటుంబ ఆస్తుల విభజన అంటే అనేక చిక్కుముడులు, మరెన్నో సందేహాలు. ముఖ్యంగా కుటుంబ పెద్ద (కర్త) మరణించిన తర్వాత ఆ ఆస్తిలో ఎవరికి ఎంత వాటా వస్తుంది? అసలు ఆడబిడ్డలకు హక్కు ఉందా? తల్లి తన వాటాను వీలునామా రాయవచ్చా? ఇలాంటి కీలక ప్రశ్నలకు 'ఆస్క్ వాలెట్ వైజ్' వేదికగా ప్రముఖ ఆర్థిక నిపుణులు బల్వంత్ జైన్ సమాధానమిచ్చారు.
చాలామందికి ఉంటే ఒక పెద్ద సందేహం 'తల్లికి HUF ఆస్తిలో వాటా ఉంటుందా?' అని. హిందూ వారసత్వ చట్టం ప్రకారం, తల్లి కుటుంబసభ్యురాలు మాత్రమే తప్ప 'సహభాగస్వామి' (Coparcener) కాదు. ఆస్తి విభజన కోరే హక్కు ఆమెకు ఉండదు. ఒకవేళ ఆమె బతికి ఉన్నప్పుడు ఆస్తి పంపిణీ జరిగితే, కుమారులతో సమానంగా ఒక వాటా ఆమెకు అందుతుంది. కానీ, ఆమెకు ఆస్తిలో ముందే నిర్దిష్ట వాటా ఉండదు కాబట్టి, ఆమె తన వాటాగా భావించిన ఆస్తిని వేరొకరికి వీలునామా రాయడం చట్టపరంగా చెల్లదు.

హిందూ వారసత్వ చట్టం 1956 సవరణ తర్వాత నిబంధనలు మారాయి. ఒక సహభాగస్వామి మరణిస్తే, అతని వాటా 'డీమ్డ్ విభజన' ద్వారా వేరు చేయబడుతుంది. ఉదాహరణకు, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే, ఆ HUF ఆస్తిలో తండ్రి వాటా 1/3వ వంతు ఉంటుంది. ఆయన వీలునామా రాయకుండా మరణిస్తే, ఆ 1/3వ వంతు ఆస్తి ఆయన చట్టబద్ధమైన వారసులకు (ఇద్దరు కొడుకులకు) సమానంగా అందుతుంది. అంటే అప్పటి నుండి వారి వ్యక్తిగత ఆస్తిగా మారుతుంది.
HUF ఆస్తుల్లో ఎవరికీ ముందే 'ఇంత వాటా' అని కచ్చితంగా ఉండదు, అది విభజన జరిగినప్పుడే తేలుతుంది. ఒకవేళ ఇప్పుడు ఆస్తి పంపిణీ జరిగితే, మిగిలిన 2/3వ వంతు ఆస్తిని ఇద్దరు సోదరులు సమానంగా పంచుకోవాలి. ఇందులో భాగంగా పెద్ద కుమారుడికి వచ్చే వాటాలో ఆయనకు, ఆయన కుమారుడికి మరియు ఆయన కుమార్తెకు ఒక్కొక్కరికి 1/9వ వంతు చొప్పున వాటా ఉంది.
గమనిక: హిందూ చట్టాల్లో వారసత్వంగా గతంలో భిన్నమైన తీర్పులు ఉన్నందున, ఇలాంటి విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఇది కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే, ఈ వన్ ఇండియా ద్రవీకరించడం లేదు
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird