అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదం అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. బహిరంగ ప్రదేశంలో ఉన్న ఎల్అండ్ కంపెనీకి చెందిన పైపులు కాలి బూడిదయ్యాయి. ప్రధాని మోదీ సభకు 5కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా చేశారా? లేక ప్రమాదవశాత్తు ఈ అగ్నిప్రమాదం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.