
Vrm media సికిందరాబాద్
సికింద్రాబాద్ విఎం న్యూస్ ( జూన్ 08)
బిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అద్యక్షులు జూబ్లిహిల్స్ నియోజకవర్గం శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ మరణం చాలా బాధాకరామని బౌధ్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ ఆన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే వారి నివాసానికి చేరుకొని ఘనంగా పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 3 సార్లు వరసగా ఎమ్మెల్యే గా విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం కృషిచేశారని కొనియాడారు. ఆయనా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో దైర్యం కల్పించారు. ఆమె వెంట స్థానిక నేతలు పాల్గొన్నారు
