
VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి రవిబాబు జూలై 14
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువుకట్టపై ఆదివారం రాత్రి మామిడికాయల లోడు లారీ బోల్తా పడి ఎనిమిది మంది దుర్మరణం చెందారు మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు మృతుల్లోఒకరిని గుర్తించారు మామిడికాయల లోటుతో లారీ రైల్వే కోడూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది మృతులంతా మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు ప్రమాద సంఘటన తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు లారీ కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటకు తీశారు గాయపడిన వారిని రాజంపేట ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో వరం జి లా వెంకటేష్. జి సీనయ్య. జి వెంకటయ్య. వెంకటరమణయ్య. పాట్లూరి వెంకటేష్. జి పుల్లమ్మ చెంచులక్ష్మి చిన్నారి గంగోత్రి జి లక్ష్మి చెంచిత. విజయలక్ష్మిలుగా గుర్తించారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మృతులలో వడివేలును గుర్తించారు గాయపడి చికిత్స పొందుతుండగా ఆయన మరణించారు రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ని క్లియర్ చేశారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసిపి. హెగ్డే పుల్లంపేట ఎస్సై శివకుమార్ ఓబులవారిపల్లి మహేష్ నాయుడు. రైల్వే కోడూరు ఎస్సై సంఘటన స్థలానికి వచ్చారు.